డీజిల్ ట్యాంకర్ బోల్తా
ABN , First Publish Date - 2021-02-23T21:56:17+05:30 IST
జిల్లాలో డీజిల్ తరలిస్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. పాడేరు
విశాఖ: జిల్లాలో డీజిల్ తరలిస్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. పాడేరు మండలం మినునులూరు సమీపంలో ఈ సంఘటన జరిగింది. హెచ్పీ కంపెనీకి చెందిన డీజిల్ను ఈ ట్యాంకర్ రవాణా చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని మినునులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోల్తా పడిన ట్యాంకర్ నుంచి ఆయిల్ కారిపోతుంది.