ఇక డిజిటల్‌ చెల్లింపులే.. చెక్కుల విధానం రద్దు

ABN , First Publish Date - 2020-03-27T12:22:05+05:30 IST

ఇక డిజిటల్‌ చెల్లింపులే.. చెక్కుల విధానం రద్దు

ఇక డిజిటల్‌ చెల్లింపులే.. చెక్కుల విధానం రద్దు

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ చెల్లింపు వ్యవహారాలన్నీ ఇక నుంచి డిజిటల్‌ రూపంలోనే జరుగనున్నాయి. చెక్కుల ద్వారా చెల్లించే విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త విధానం వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే....ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ఈమేరకు గురువారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయం నేపథ్యంలో రుణమాఫీ డబ్బులు కూడా నేరుగా బ్యాంకు ఖాతాలోకే బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ సూచనల మేరకు ఈ విధానాన్ని అమలుపరుస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - 2020-03-27T12:22:05+05:30 IST