లాక్‌డౌన్ నిబంధనలను ఫాలోకాను... ఏమైనా చేసుకోండి : దిలీప్ ఘోష్

ABN , First Publish Date - 2020-05-28T23:17:35+05:30 IST

తాను మాత్రం మమతా సర్కార్ విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఎంతమాత్రమూ ఫాలో కానని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెగేసి

లాక్‌డౌన్ నిబంధనలను ఫాలోకాను... ఏమైనా చేసుకోండి : దిలీప్ ఘోష్

కోల్‌కతా : తాను మాత్రం మమతా సర్కార్ విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఎంతమాత్రమూ ఫాలో కానని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెగేసి చెప్పారు. మమత బెనర్జీ ఏం చేసినా సరే, తాను మాత్రం ఫాలో కానని ప్రకటించారు. ఆంఫన్ కారణంగా దెబ్బతిన్న ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను తృణమూల్ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.


తాము సహాయక చర్యలు చేస్తూ, ప్రజలకు తోడ్పడదామంటే సర్కార్ అడ్డుకుంటోందని, పోలీసులు కూడా అనుమతులను మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. అందుకే ఘర్షణాత్మక పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. అధికార టీఎంసీ నేతలు, ముఖ్యమంత్రి ప్రతిరోజూ వివిధ ప్రాంతాలను పర్యటిస్తూనే ఉన్నారని, తమని మాత్రం పోలీసులు, ప్రభుత్వం అడ్డుకుంటోందని ఘోష్ ధ్వజమెత్తారు. 

Updated Date - 2020-05-28T23:17:35+05:30 IST