అనాథ పిల్లలను దత్తత తీసుకున్న దిల్‌రాజు

ABN , First Publish Date - 2020-08-02T08:48:51+05:30 IST

యాదాద్రి జిల్లా ఆత్మకూరులో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలను మంత్రి

అనాథ పిల్లలను దత్తత తీసుకున్న దిల్‌రాజు

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి జిల్లా ఆత్మకూరులో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచన మేరకు సినీ నిర్మాత దిల్‌ రాజు దత్తత తీసుకున్నారు. ఆత్మకూరుకు చెందిన గట్టు సత్తయ్య, అనురాధ దంపతులకు ముగ్గురు సంతానం. ఏడాది క్రితమే సత్తయ్య చనిపోగా, 3 రోజుల క్రితం తల్లి మరణించడంతో.. వారిపిల్లలు అనాథలుగా మారిన విషయం తెలిసిందే.  

Updated Date - 2020-08-02T08:48:51+05:30 IST