జంటనగరాల్లో ప్రారంభమైన డిస్ఇన్ఫెక్షన్ స్ర్పే పనులు
ABN , First Publish Date - 2021-04-18T20:23:23+05:30 IST
జంటనగరాల్లో కరోనా ఉధృతి తీవ్రం అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈమేరకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి నివారణకు,
హైదరాబాద్: జంటనగరాల్లో కరోనా ఉధృతి తీవ్రం అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈమేరకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి నివారణకు, వైరస్ వ్యాప్తి పెరగకుండా డిస్ ఇన్ఫెక్షన్ స్ర్పే పనులు జీహెచ్ఎంసి అధికారులు ప్రారంభించారు. ఇప్పటికే నగరంలోని పరిస్థితి పై మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అఽధికారులతో సమీక్ష నిర్వహించారు. వెంటనే నగరంలోని ప్రధాన కూడళ్లు, మార్కెట్లు, పార్కులు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా డిస్ ఇన్ఫెక్షన్ స్ర్పే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించడంతో ఆదివారం ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లో జీహెచ్ఎంసిలోని డిఆర్ఎఫ్ సిబ్బంది అన్ని ప్రాంతాల్లో డిస్ ఇన్ఫెక్షన్ స్ర్పేపనులు ప్రారంభించారు.
ప్రజా రోగ్య పరిరక్షణకు ఒక శాతం సోడియం హైపో క్టోరైడ్ ద్రావకంతో కూడిన స్ర్పేయింగ్ పనులు చేపట్టారు. సోడియం హైపో క్లోరైడ్తో పాటు అవసరమైన డిస్ ఇన్ఫెక్షన్ మందులను తగిన మొత్తంలో సేకరించినట్టు అధికారులు తెలిపారు. స్ర్పేయింగ్ పనులతో పాటు నగరంలోని ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త, గార్బేజ్ను కూడా ఎప్పటికప్పుడు తొలగించే పనులు చేపట్టినట్టు జీహెచ్ఎంసి అధికారులు తెలిపారు.