కరోనా కిట్ల కొరతతో పరీక్షలు నిలిపివేత
ABN , First Publish Date - 2021-05-08T04:30:47+05:30 IST
కరోనా విస్తరిస్తున్న పరిస్థితుల్లో పరీక్షల కోసం వచ్చే ప్రజలు అ వస్థలు పడుతున్నారు.
పెద్దమందడి, మే 7 : కరోనా విస్తరిస్తున్న పరిస్థితుల్లో పరీక్షల కోసం వచ్చే ప్రజలు అ వస్థలు పడుతున్నారు. పెద్దమందడి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి శుక్రవారం ఉద యం ఆరు గంటల నుంచే సుమారు 25 మంది వచ్చి వరుసలో ఇటుకలు, చెప్పులు, వాటర్ బాటిళ్లు పెట్టారు. పరీక్షలు చేసే వైద్య సిబ్బంది కోసం ఎదురు చూశారు. తీరా పది గంటలకు వచ్చిన వారు కరోనా పరీక్షల కిట్లు లేవని చెప్పారు. రేపటికి కూడా కిట్లు వస్తేనే పరీక్షలు చేస్తామన్నారు. దీంతో అప్పటికే అక్కడికి వచ్చిన సుమారు 60 మంది వెనుదిరిగి వెళ్లిపోయారు.