చిత్తూరులో టీడీపీ శ్రేణుల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2021-09-05T03:00:57+05:30 IST
చిత్తూరులో టీడీపీ శ్రేణుల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు
చిత్తూరు: దిశా చట్టం సక్రమంగా అమలు కాకపోవడంపై చిత్తూరులో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రమ్య హత్య సంఘటనను నిరసిస్తూ చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నిరసన చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబుతో సహా పలువురు ముఖ్య నేతలు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులకు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు, ప్రభుత్వానికి టీడీపీ శ్రేణులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.