డాక్టర్ సాంబశివారెడ్డికి విశిష్ఠ రైతు పురస్కారం
ABN , First Publish Date - 2021-04-16T10:05:26+05:30 IST
వ్యవసాయ యాంత్రీకరణలో నూతన ఆవిష్కరణ అమలు చేసినందుకు డాక్టర్ యరగూటి సాంబశివారెడ్డికి విశిష్ఠ రైతు పు
నకరికల్లు, ఏప్రిల్ 15: వ్యవసాయ యాంత్రీకరణలో నూతన ఆవిష్కరణ అమలు చేసినందుకు డాక్టర్ యరగూటి సాంబశివారెడ్డికి విశిష్ఠ రైతు పురస్కారం లభించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్రెడ్డి చేతుల మీదుగా ఆయన ఉగాదిరోజు ఈ పురస్కారం అందుకున్నారు. డాక్టర్ సాంబశివారెడ్డి రూపొందించిన నూతన ఆవిష్కరణ దేశంలోని కోట్లాది ఉద్యాన రైతులు చెట్లపాదులు సులువుగా చేసుకొనే అవకాశాన్ని కల్పించినట్లయిందని ఉప కులపతి పురస్కార ప్రదాన సమయంలో పేర్కొన్నారు.