వలస కూలీలకు భోజన ప్యాకెట్లు పంపిణీ
ABN , First Publish Date - 2020-05-31T11:47:26+05:30 IST
మాజీ ఎమ్మెల్యే పో తుల రామారావు జన్మదినం సందర్భంగా పో తుల యువసేన ఆధ్వర్యంలో శనివారం టం గుటూరు
టంగుటూరు, మే 30: మాజీ ఎమ్మెల్యే పో తుల రామారావు జన్మదినం సందర్భంగా పో తుల యువసేన ఆధ్వర్యంలో శనివారం టం గుటూరు టోల్ప్లాజా వద్ద వలస కూలీలకు భోజనం ప్యాకెట్ల పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా పోతుల రామారావు స్వయంగా వాహనాలను ఆపి ప్రయాణికులకు భోజనం ప్యాకెట్లు అందించారు. ముందుగా పోతుల స్వగృహంలో కేక్కట్ చేశారు. అలాగే ఒంగోలు కు చెందిన సినార్డు స్వచ్ఛంద సేవా సంస్థ ఆ ధ్వర్యంలో శనివారం టంగుటూరు టోల్ప్లాజా వద్ద వలస కూలీలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు.
గుడ్లూరు: మండలంలోని చేవూరు చెక్ పోస్టు కేంద్రం వద్ద వలస కూలీలకు కందు కూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి భోజనం ప్యాకెట్లను అందజేశారు.
మద్దిపాడు: మారెళ్లగుంటపాలెంలోని ఆస రా కేంద్రానికి ఇండియన్ క్రిష్టియన్ మినిస్ర్టీ ప్రతినిధి విక్టర్పాల్ శనివారం రెండు వీల్ ఛైర్లు అందజేశారు. కార్యక్రమంలో చిడిపోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.