90 శాతం రాయితీపై కాఫీ పల్పర్లు పంపిణీ

ABN , First Publish Date - 2021-03-01T06:31:57+05:30 IST

ఆదివాసీ రైతులకు 90 శాతం రాయితీపై కాఫీ పల్పర్లు పంపిణీ చేస్తున్నామని స్థానిక ఉద్యాన శాఖ అధికారి మత్స్యరాజు అన్నారు.

90 శాతం రాయితీపై కాఫీ  పల్పర్లు పంపిణీ
రైతులకు కాఫీ పల్పర్లు పంపిణీచేస్తున్న హెచ్‌వో మత్స్యరాజు


చింతపల్లి, ఫిబ్రవరి 28: ఆదివాసీ రైతులకు 90 శాతం రాయితీపై కాఫీ  పల్పర్లు పంపిణీ చేస్తున్నామని స్థానిక ఉద్యాన శాఖ అధికారి మత్స్యరాజు అన్నారు. ఆదివాసీ రైతులు చెర్రీ కాఫీ తయారుచేసుకుని విక్రయించుకోవడం వల్ల అధిక ధర పొందలేకపోతున్నారన్నారు. ఈమేరకు రైతు పార్చిమెంట్‌ కాఫీ తయారుచేసుకునేందుకు కాఫీబోర్డు, ఐటీడీఏ సంయుక్తంగా రాయితీపై  పల్పర్లు అందజేస్తుందన్నారు. కొయ్యూరుకి 35, జీకేవీధికి 40, చింతపల్లికి 75  పల్పర్లు మంజూరయ్యాయన్నారు. పార్చిమెంట్‌ కాఫీకి రెట్టి ధర లభిస్తుందని, రైతులందరూ పార్చిమెంట్‌ తయారుచేసుకుని విక్రయించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో సబ్‌ అసిస్టెంట్‌ రమణ పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-01T06:31:57+05:30 IST