రూ.24 లక్షల విలువైన వంట సామగ్రి పంపిణీ

ABN , First Publish Date - 2021-12-08T04:58:41+05:30 IST

ఇంటర్నేషనల్‌ లయన్స్‌ క్లబ్‌ హైదరాబాదు వారి సహకారంతో మంగళవారం రాజంపేట ప్రాంతంలోని వరద బాధితులకు 24 లక్షల రూపాయల విలువ చేసే వంట సామగ్రి కిట్ల బాక్సులను అందజేశారు.

రూ.24 లక్షల విలువైన వంట సామగ్రి పంపిణీ
వరద బాధితులకు వస్తువులు అందజేస్తున్న దృశ్యం

రాజంపేట, డిసెంబరు 7 : ఇంటర్నేషనల్‌ లయన్స్‌ క్లబ్‌ హైదరాబాదు వారి సహకారంతో మంగళవారం రాజంపేట ప్రాంతంలోని వరద బాధితులకు 24 లక్షల రూపాయల విలువ చేసే వంట సామగ్రి కిట్ల బాక్సులను అందజేశారు. లయన్స్‌క్లబ్‌ 320సీ హైదరాబాదు సహకారంతో గుండ్లూరు, పులపత్తూరు, అడవిరాచప ల్లె, దిగువ మందపల్లె, పాపరాజుపల్లె, హేమాద్రివారిపల్లె, పాటూరు, హరిజనాడ, తొ గూరుపేట గ్రామాల్లోని 600 కుటుంబాలకు వంట సామగ్రి, నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ చేశారు. వీటిలో ప్రధానంగా రైస్‌కుక్కర్లు, స్టీల్‌ప్లేట్లు, బెడ్‌షీట్లు, బియ్యం, కందిపప్పు, చీర, లుంగీలతో పాటు పలు రకాల వస్తువులను అందజేశారు. లయన్స్‌క్లబ్‌ హైదరాబాదు 320సీ గవర్నర్‌ ఆవుల గోపాలరావు, రాజంపేట లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, జిల్లా నాయకులు కొండూరు శరత్‌కుమార్‌రాజు, ఇంటర్నేషనల్‌ లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధి హరీ్‌షరెడ్డి, వెంకట నారాయణరెడ్డి, మనోహర్‌రాజు, సూర్యనారాయణ, నాగన్న, వెంకటరాజుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T04:58:41+05:30 IST