నిత్యావసర సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2020-04-04T10:33:57+05:30 IST

పేట మండలంలోని కోటకొండ గ్రామంలో ఆర్‌ఎస్‌ఎస్‌, శివాజీ యువసేన

నిత్యావసర సరుకుల పంపిణీ

నారాయణపేట రూరల్‌/మాగనూరు/దామరగిద్ద, ఏప్రిల్‌ 3 : పేట మండలంలోని కోటకొండ గ్రామంలో ఆర్‌ఎస్‌ఎస్‌, శివాజీ యువసేన ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు అందజేస్తున్నట్లు ఆయా సంఘాల నాయకులు రవికుమార్‌, బాలరాజు, ప్రవీణ్‌, గోవిందు, కెంచె కుమార్‌, సూర్తి సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


జాజాపూర్‌ గ్రామంలో పేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ అబ్దుల్‌ అజీం ఒక్కో కుటుంబానికి రూ.1100ల చొప్పున మూడు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. మాగనూరు మండలంలోని కొల్పూరు గ్రామంలో మహిళా సమాఖ్య అధ్వర్యంలో శుక్రవారం ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఎంపీపీ శ్యామలమ్మ, జడ్పీటీసీ వెంకటయ్య, సర్పంచ్‌ జయప్రద, ఎంపీటీసీ శ్యామలాదేవి, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, వీఆర్వో తదితరులు ఉన్నారు. దామరగిద్ద మండలంలోని దామరగిద్ద, కాన్‌కుర్తి, మొగుల్‌మడ్క, గడిమున్కన్‌పల్లి, క్యాతన్‌పల్లి తదితర గ్రామాల్లో ప్రజలకు రేషన్‌ బియ్యం పంపిణీ చేశారు.

Updated Date - 2020-04-04T10:33:57+05:30 IST