ప్రహసనంగా నిత్యావసరాల పంపిణీ
ABN , First Publish Date - 2020-06-06T08:43:45+05:30 IST
పట్టణంలో పెద్ద రామాలయం వద్ద ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నిత్యా వసరాల పంపిణీ ఒక
రాత్రి వరకు కొనసాగిన హైడ్రామా
పోలీస్ జోక్యంతో పాక్షిక పంపిణీ
జగ్గయ్యపేట, జూన్ 5: పట్టణంలో పెద్ద రామాలయం వద్ద ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నిత్యా వసరాల పంపిణీ ఒక ప్రహసనంగా మారింది. జగ్గయ్యపేట క్వారంటైన్ సెంటర్లలో మిగిలిన నిత్యావసరాలను ఐసీడీఎస్ ద్వారా లబ్ధిపొందే వారికి మాత్రమే పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించగా పట్టణంలో పెద్ద రామాలయం వద్ద ఏర్పాట్లు చేశారు. అది తెలుసుకున్న అనేకమంది పేద మహిళలు తమకు కూడా నిత్యావసరాలు అందజేయాలని ఉదయం 11 గంటల నుంచి రామాలయం ముందు బైఠా యించారు.
దీంతో అంగన్వాడీలు ఎంపిక చేసిన వారు కూడా రాత్రి 7గంటల వరకు వేచి ఉన్నారు. ఆఖరుకు పోలీ సులు జోక్యంతో పాక్షికంగా పంపిణీ చేసి చీకటి పడటంతో సరుకులను సమీపంలో అంగన్వాడీ కేంద్రానికి తరలిం చారు. ఐసీడీస్ అధికారుల బాధ్యతారాహిత్యమే ఈ గందర గోళానికి కారణమని విమర్శలు వస్తున్నాయి. ఏ సెంటర్ లోని వారికి ఆ సెంటర్ ద్వారా పంపిణీ చేస్తే ఈ ఇబ్బందు లేమీ ఉండేవి కాదని, పైగా కరోనా భయం లేకుండా ముందస్తు జాగ్రత్తలు లేకుండా సామూహిక పంపిణీకి సిద్ధపడటం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.