వలంటీర్ల ద్వారా సరుకులు పంపిణీ : ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2020-04-04T09:24:04+05:30 IST

కరోనా నియంత్రణలో భాగంగా రేషన్‌సరుకులను వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పంపిస్తామని ఎమ్మెల్సీ

వలంటీర్ల ద్వారా సరుకులు  పంపిణీ : ఎమ్మెల్సీ

బద్వేలు రూరల్‌, ఏప్రిల్‌ 3: కరోనా నియంత్రణలో భాగంగా రేషన్‌సరుకులను వలంటీర్ల ద్వారా  ఇంటి వద్దకే పంపిస్తామని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య పేర్కొన్నా రు. స్థానిక రాచపూటి నాగభూషణం డిగ్రీకళాశాలలో అధికారుల సమీక్షలో వారు మాట్లాడుతూ రేషన్‌సరుకుల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా వలంటీర్ల ద్వారా సరఫరా చేస్తామన్నా రు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ పద్మజ, మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్‌, తహసీల్దార్‌ వెంకటరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ క్రిష్ణారెడ్డి, ఎంపీడీఓ రామక్రిష్ణయ్య,  అర్బన్‌, రూరల్‌ సీఐలు రమే్‌షబాబు, వెంకటాచలపతి, వైద్యాధికారులు చంద్రహా్‌సరెడ్డి, రాంప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 


స్థానిక ఎస్‌బీవీఆర్‌ కళాశాల ఆవరణలోని బాయిస్‌ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన క్వారెన్‌టైన్‌ సెంటర్‌ను శుక్రవారం ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి, పీడీ మురళీదేవి పరిశీలించారు. క్వారెన్‌టైన్‌లో ఉన్న వారికి భోజన సదుపాయం కల్పించాలన్నా రు. మంచినీటి సౌకర్యం, సాయంత్రం స్నాక్స్‌ అందించాలని అధికారులకు ఆదేశించారు. తహసీల్దార్‌ వెంకటరెడ్డి, మున్సిపల్‌ కమీషనర్‌ క్రిష్ణారెడ్డి, వైద్యాధికారులు చంద్రహా్‌సరెడ్డి, వర్ధన్‌రెడ్డి, నర్మద తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-04T09:24:04+05:30 IST