పేద కుటుంబానికి సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2021-04-21T05:59:17+05:30 IST

నిరుపేద కుటుంబానికి నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయమని టీపీసీసీ సభ్యులు, ఖేడ్‌ లయన్స్‌ క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ సంజీవరెడ్డి పేర్కొన్నారు.

పేద కుటుంబానికి సరుకుల పంపిణీ

మనూరు, ఏప్రిల్‌ 20: నిరుపేద కుటుంబానికి నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయమని టీపీసీసీ సభ్యులు, ఖేడ్‌ లయన్స్‌ క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ సంజీవరెడ్డి పేర్కొన్నారు. సీనియర్‌ న్యాయవాది, ఏఎంసీ మాజీ చైర్మన్‌ వీరారెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుమారులు ఫణిందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి మండల పరిధిలోని దుద్దగొండ గ్రామానికి చెందిన నిరుపేద  కుటుంబానికి రూ. 5 వేల  విలువైన సరుకులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అనుచరుడిగా వీరారెడ్డి ప్రజలకు సేవలు అందజేశారన్నారు. కార్యక్రమంలో దుద్దగొండ సర్పంచ్‌ రాజు, లయన్స్‌క్లబ్‌ బాధ్యులు ముత్యాల మహేష్‌,  చంద్రశేఖర్‌, వెంకట్‌రావు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T05:59:17+05:30 IST