కరోనా బాధితులకు మెడికల్ కిట్లు పంపిణీ
ABN , First Publish Date - 2021-05-11T05:48:21+05:30 IST
మండలంలోని పులేరు పంచాయతీ కొత్తబయన్నపల్లిలో అధికారులు పర్యటించి కరోనా బాదితులకు మెడికల్ కిట్లను సోమవారం పంపిణీ చేశారు.
గోరంట్ల, మే 10: మండలంలోని పులేరు పంచాయతీ కొత్తబయన్నపల్లిలో అధికారులు పర్యటించి కరోనా బాదితులకు మెడికల్ కిట్లను సోమవారం పంపిణీ చేశారు. కొత్తబయన్నపల్లిలో కరోనా కారణంగా రెండు రోజుల క్రితం టీడీపీ నాయకుడు రాజగోపాల్ , లక్ష్మీదేవి దంపతులు మృతి చెందగా మరికొందరికి గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎంపీడీఓ అంజినప్ప, సర్పంచ ప్రభాకర్రావుతో పాటు పంచాయతీ సిబ్బంది గ్రామంలో సోమవారం పర్యటించారు. ఐదు మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా వారికి మెడికల్ కిట్లుఅందజేసి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకునేలా అవగాహన కల్పించారు. 14రోజులు హోమ్ ఐసొలేషనలో ఉండాలని సూచిస్తూ ఇంటి గోడకు హెచ్చరిక నోటీసు ఏర్పాటుచేశారు. ఏఎనఎంలు పాజిటివ్ వచ్చిన వారిని సందర్శిస్తూ ఎప్పటికప్పుడు ఆరోగ్య సమాచారం తీసుకోవాలన్నారు. ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా ప్రజలు టోల్ఫ్రీ నంబరు, సబ్ కలెక్టర్ ఆఫీసు 8374057927కు, గోరంట్ల కంట్రోల్ రూమ్ 6281219945 సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శంకర, యోగి, వీఆర్ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.