వృద్ధులకు మందుల పంపిణీ
ABN , First Publish Date - 2021-05-19T05:09:01+05:30 IST
వృద్ధులకు మందుల పంపిణీ
మంచాల: యూత్ఫర్ యాంటీ కరప్షన్ ఎన్జీవోస్ సంస్థ అధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఉచిత మెడిసిన్ పంపిణీ చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి చెరుకూరి జంగయ్య తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇంటినుంచి బయటకు వెళ్లలేని వృద్ధులు, వికలాంగులు, మహిళలకు మెడిసిన్ పంపిణీ కొనసాగుతోందన్నారు. మంగళవారం దాథ్పల్లి వెంకటేశ్వరతండాల్లో మందులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ఇప్పటికే 200మందికి మందుల పంపిణీ చేసిందన్నారు. మెడిసిన్ అవసరమున్న వారు ఫోన్చేస్తే మందులను ఇంటికే తెచ్చి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో వైఏసీ ఫౌండర్ రాజేంద్ర, అధ్యక్షుడు గిరిధర్, ప్రతినిధి స్వప్న పాల్గొన్నారు.