నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ

ABN , First Publish Date - 2021-10-28T04:16:16+05:30 IST

మండలంలోని దిగువమెట్ట ఎస్టీ కాలనీకి చెందిన 53 నిరుపేద విద్యార్థుల కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ
సరుకులను అందజేస్తున్న సొసైటీ ప్రతినిధులు


గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 27 : మండలంలోని దిగువమెట్ట ఎస్టీ కాలనీకి చెందిన 53 నిరుపేద  విద్యార్థుల కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. 25 కిలోల బియ్యం, సరుకులు, న్యూట్రిషన్‌ ఫుడ్‌ను హాత్స్‌ సంస్థ ప్రతినిధులు బుధవారం అందజేశారు. బిల్డ్‌ హెల్ప్‌ సంస్థ సమన్వయకర్త డాక్టర్‌ సతీష్‌సామ్యేలు మాట్లాడుతూ హాత్స్‌ సంస్థ గ్రామీణ ప్రాంతంలోని పేద విద్యార్థులు, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.  కార్యక్రమంలో హాత్స్‌ సంస్థ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఫ్రెండ్స్‌ సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ బిజ్జం చిన్ననరసయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు. కాగా దిగువమెట్ట పంచాయతీలోని పలు గ్రామాలకు చెందిన 250 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 


Updated Date - 2021-10-28T04:16:16+05:30 IST