విద్యార్ధులకు పౌష్టికాహారం పంపిణీ

ABN , First Publish Date - 2020-08-05T11:28:59+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈనెల 26వతేదీ వరకు రెండు విడతల్లో పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నట్లు ..

విద్యార్ధులకు పౌష్టికాహారం పంపిణీ

నెల్లూరు(విద్య), ఆగస్టు 4 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈనెల 26వతేదీ వరకు రెండు విడతల్లో పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11వతేదీ వరకు 1 నుంచి 5వతరగతి వరకు విద్యార్థులకు ఒక్కొక్కరికి 4 కేజీల బియ్యం, 6 నుంచి 10 తరగతులకు వారికి 6 కేజీల బియ్యాన్ని పంపిణీ చేశామన్నారు. అయితే ఆ సమయంలో గుడ్లు, చిక్కీల టెండర్లు ఖరారు కాకపోవడంతో వీటిని నిలిపివేశారు. తాజాగా వీటికి అనుమతులు రావడంతో మంగళవారం నుంచి 13వతేదీ వరకు, 14 నుంచి 26వతేదీ వరకు రెండు విడతల్లో గుడ్లు, చిక్కీలతో కలిపి పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో విద్యార్థికి 14 గుడ్లు, 10 చిక్కీలను వలంటీర్లు అందజేస్తారని, జిల్లాలోని 2,16,320 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

Updated Date - 2020-08-05T11:28:59+05:30 IST