విశ్రాంత ఉద్యోగులకు బియ్యం పంపిణీ
ABN , First Publish Date - 2020-05-26T05:36:51+05:30 IST
హుజూరాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం
హుజూరాబాద్, మే 25: హుజూరాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం, హుజూరాబాద్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం 40మంది నిరుపేద రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పంపిణీ చేసిన బియ్యం, నిత్యావసర సరుకులను తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చెల్పూరి వెంకన్న, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, హుజూరాబాద్ డిపో మేనేజర్ రాజ్యలక్ష్మిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హుజూరాబాద్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చారి, ప్రధాన కార్యదర్శి తౌటం సంపత్కుమార్తో పాటు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.