దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ
ABN , First Publish Date - 2021-10-25T04:47:02+05:30 IST
కోరమాండల్ ఎంప్లాయీస్ యూనియన్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ఆదివారం ట్రై సైకిళ్లు, వీల్చైర్లు, ఆధునిక హియరింగ్ మెషీన్లు, అనాథాశ్రమానికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
మల్కాపురం, అక్టోబరు 24 : కోరమాండల్ ఎంప్లాయీస్ యూనియన్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ఆదివారం ట్రై సైకిళ్లు, వీల్చైర్లు, ఆధునిక హియరింగ్ మెషీన్లు, అనాథాశ్రమానికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. వీటిని కోరమాండల్ ఎరువుల కర్మాగారం అధికారులు సమీర్ గోయల్, జ్ఞానసుందరం, రంగకుమార్, యూనియన్ ప్రధాన కార్యదర్శి సేనాపతి మహేశ్ చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ సమీర్ గోయల్ మాట్లాడుతూ ఉద్యోగులు వారి వేతనం నుంచి ప్రతి నెలా కొంత సొమ్మును కేటాయించి ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాఽధ్యక్షులు సీహెచ్ శివరమేశ్, పీటీఎస్ రాజశేఖర్ తో పాటు పలువురు యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.