కొవిడ్‌తో జిల్లా ఆడిటింగ్‌ అధికారి మృతి

ABN , First Publish Date - 2021-05-16T05:30:00+05:30 IST

పెనుమూరు మండలంలోని ఉప్పిలిపల్లెవాసి జయంత్‌బాబు కరోనాతో మృతి చెందినట్లు తహసీల్దారు చంద్రశేఖర్‌ తెలిపారు.

కొవిడ్‌తో జిల్లా ఆడిటింగ్‌ అధికారి మృతి
జయంత్‌బాబు (ఫైల్‌ఫొటో)

 నంజరపల్లెలో మరో ఇద్దరు..

పెనుమూరు, మే 16 : పెనుమూరు మండలంలోని ఉప్పిలిపల్లెవాసి జయంత్‌బాబు కరోనాతో మృతి చెందినట్లు తహసీల్దారు చంద్రశేఖర్‌ తెలిపారు. జయంత్‌బాబు  జిల్లా ఆడిటింగ్‌ అధికారిగా కలెక్టరేట్‌లో విధులు నిర్వహించేవారు. కొద్ది రోజుల క్రితం ఈయనకు కరోనా నిర్ధారణ కాగా తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. జయంత్‌బాబుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అలాగే మండలంలోని నంజరపల్లె పంచాయతీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనాతో మృతి చెందారు. మండలంలో ఆదివారం 27 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-05-16T05:30:00+05:30 IST