ప్లాస్మా దానానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే, కలెక్టర్

ABN , First Publish Date - 2020-08-05T19:45:04+05:30 IST

గుంటూరు: కరోనా పాజిటివ్ నుంచి బయట పడిన ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు.

ప్లాస్మా దానానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే, కలెక్టర్

గుంటూరు: కరోనా పాజిటివ్ నుంచి బయట పడిన ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తూ రెడ్ క్రాస్ సొసైటీలో ప్లాస్మా దానం చేస్తూ అంగీకార పత్రాలను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. జులై నెలలోనే 170 కరోనా మరణాలు జిల్లాలో నమోదయ్యాయన్నారు. కరోనా మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్లాస్మా డొనేషన్‌ను ప్రోత్సహిస్తోందన్నారు. బ్లడ్ బ్యాంక్‌లలో ప్లాస్మా సేకరణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. సేకరించిన ప్లాస్మాను ప్రత్యేక కమిటీ నిర్ణయించిన వారికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - 2020-08-05T19:45:04+05:30 IST