జిల్లా జైలు తనిఖీ

ABN , First Publish Date - 2022-04-09T05:25:36+05:30 IST

జిల్లా జైలును జైళ్లశాఖ వరంగల్‌ రేజి డీఐజీ డి శ్రీనివాస్‌ శుక్రవారం తనిఖీ చేశారు.

జిల్లా జైలు తనిఖీ
జైలులో తనిఖీలు నిర్వహించి, ఖైదీలతో మాట్లాడుతున్న డీఐజీ శ్రీనివాస్‌

 కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 8: జిల్లా జైలును జైళ్లశాఖ వరంగల్‌ రేజి డీఐజీ డి శ్రీనివాస్‌ శుక్రవారం తనిఖీ చేశారు. జైలులో ఖైదీల యోగక్షేమాలు, భోజన వసతులు, న్యాయసేవ, ఆరోగ్య సమస్యల గురించి ఖైదీలను, సిబ్బందిని ఆయన అడిగి తెలుసుకున్నారు. జైలులోని క్యాంటిన్‌, ఆసుపత్రి, ములాఖత్‌ ఫోన్‌ సౌకర్యం, లైబ్రరీ, వంటశాల, జైలు ఇండస్ట్రీ, పెట్రోల్‌బంక్‌ల పనితీరు, గార్డెన్‌ నిర్వహణ, పరిశుభ్రత బాగుందని అధికారులు, సిబ్బందిని అభినందించారు. అనంతరం జైలులోని వివిధ విభాగాల్లో రికార్డులను పరిశీలించారు.  కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ సమ్మయ్య, జిల్లా సబ్‌ జైళ్ల అధికారి శ్రీనివాస్‌, జైలు వైద్యాధికారి డాక్టర్‌ రమేష్‌, జైలర్లు శ్రీనివాస్‌, రమేష్‌, డిప్యూటీ జైలర్లు శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-09T05:25:36+05:30 IST