జిల్లా జడ్జీతో కలెక్టర్‌ భేటీ

ABN , First Publish Date - 2021-10-24T04:49:29+05:30 IST

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబుతో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ సమావేశమయ్యారు. శనివారం ఉదయం జిల్లా జడ్జ్జి కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్‌ తొలుత పుష్పగుచ్ఛాన్ని అందించారు.

జిల్లా జడ్జీతో కలెక్టర్‌ భేటీ
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ వీ రవీంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

గుంటూరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబుతో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ సమావేశమయ్యారు. శనివారం ఉదయం  జిల్లా జడ్జ్జి కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్‌ తొలుత పుష్పగుచ్ఛాన్ని అందించారు. అనంతరం అండర్‌ ట్రైల్‌ రివ్యూ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అండర్‌ ట్రైల్‌ ఖైదీలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రూరల్‌ ఎస్‌పీ విశాల్‌ గున్నీ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రత్నకుమార్‌, అర్బన్‌ అదనపు ఎస్‌పీ గంగాధరం, రూరల్‌ అదనపు ఎస్‌పీ రిషాంతరెడ్డి, జైలు సూపరింటెండెంట్‌ డీఎస్‌పీ హంసాపాల్‌, డీసీఆర్‌బీ డీఎస్‌పీ లక్ష్మయ్య, జైలర్‌ కిరణ్‌, సబ్‌జైలర్‌ ప్రేమసాగర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-24T04:49:29+05:30 IST