ప్రభుత్వాస్పత్రిలో జిల్లా జడ్జి తనిఖీలు

ABN , First Publish Date - 2022-01-19T07:09:41+05:30 IST

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రభుత్వాస్పత్రిలో జిల్లా జడ్జి తనిఖీలు
వైద్యులతో మాట్లాడుతున్న జిల్లా జడ్జి పార్థసారథి

చిత్తూరు రూరల్‌, జనవరి 18: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యసేవలపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అరుణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగుల సహాయకులతో మాట్లాడి.. వైద్యసేవలపై ఆరా తీశారు. అలాగే ఆస్పత్రి ఆవరణలోని వన్‌స్టా్‌ప సెంటర్‌ను పరిశీలించారు. అలాగే ఆస్పత్రిలోని మెటర్నిటీ, పీడియాట్రిక్‌, ఓపీ, క్యాజువాల్టీ, సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌, డయాలసిస్‌ యూనిట్‌, ఇన్‌పేషంట్‌ వార్డుల్లో కలియతిరిగారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2022-01-19T07:09:41+05:30 IST