జిల్లాకబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు తులసీరామ్ రెడ్డి మృతి
ABN , First Publish Date - 2021-05-17T04:12:34+05:30 IST
మండల పరిధిలోని లేగుంటపాడు గ్రామానికి చెందిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు గునపాటి తులసీరామ్రెడ్డి (70) ఆదివారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చెందుతూ మృతి చెందారు.
కోవూరు, మే 16 : మండల పరిధిలోని లేగుంటపాడు గ్రామానికి చెందిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు గునపాటి తులసీరామ్రెడ్డి (70) ఆదివారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చెందుతూ మృతి చెందారు. వీఆర్ కళాశాల విద్యార్థి సంఘ నాయకుడిగా ఆయన రాజకీయరంగ ప్రవేశం చేశారు. క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ లేగుంటపాడు అభివృద్ధికి కృషి చేశారు. కబడ్డీ క్రీడాకారుడిగా, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కబడ్డీ క్రీడకు ప్రోత్సాహం అందించారు. ఇటీవల వైసీపీలో చేరారు. జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్బాబురెడ్డి, అలాగే టీడీపీ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర్లురెడ్డి మాట్లాడుతూ ఎందరో కబడ్డీ క్రీడాకారులను తీర్చిదిద్దిన తులసీరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడ్ని ప్రార్థిసున్నట్లు తెలిపారు.