టీఆర్‌ఎస్‌ ‘విజయ గర్జన’ సన్నాహక సమావేశంలో జిల్లా నేతలు

ABN , First Publish Date - 2021-10-23T06:22:02+05:30 IST

తెలంగాణ రాష్ట్రసమితి నిర్వహించబోయే ప్లీనరీ, తెలంగాణ విజయ గర్జన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం హైదరా బాద్‌లో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిర్వహించిన సమావేశానికి జిల్లాకు చెందిన నాయకులు హాజరయ్యారు.

టీఆర్‌ఎస్‌ ‘విజయ గర్జన’ సన్నాహక సమావేశంలో జిల్లా నేతలు
సన్నాహక సమావేశానికి హాజరైన జిల్లా ప్రముఖులు

నిర్మల్‌ కల్చరల్‌, అక్టోబరు 22 : తెలంగాణ రాష్ట్రసమితి నిర్వహించబోయే ప్లీనరీ, తెలంగాణ విజయ గర్జన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం హైదరా బాద్‌లో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిర్వహించిన సమావేశానికి జిల్లాకు చెందిన నాయకులు హాజరయ్యారు. నియోజకవర్గస్థాయి ప్రతినిధులతో తె లంగాణ భవన్‌లో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా నిర్మల్‌ నుంచి నా యకులు సమావేశంలో పాల్గొన్నారు. నవంబరు 15న జరిగే విజయ గర్జనసభ క్షేత్రస్థాయి నుండి పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా చూడాలని కేటీఆర్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ జి.ఈశ్వర్‌, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్‌, నిర్మల్‌ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌, తదితర నాయకగణం పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-23T06:22:02+05:30 IST