టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల్లో జిల్లా నేతలు
ABN , First Publish Date - 2021-10-17T05:15:10+05:30 IST
టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురు నేతలకు చోటుదక్కింది.
చిత్తూరు సిటీ, అక్టోబరు 16: టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురు నేతలకు చోటుదక్కింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చన్నాయుడు శుక్రవారం నియామక ప్రకటన విడుదల చేశారు. నేషనల్ స్పోక్స్పర్సన్గా గురజాల మాల్యాద్రి(తిరుపతి), రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా ఎన్.శ్రీనాథరెడ్డి(పుంగనూరు), కార్యదర్శులుగా వెంకిటీల సురేంద్రకుమార్(చిత్తూరు), ఎన్.విజయలక్ష్మి(తిరుపతి), బుచ్చినేని రమణ(తిరుపతి) నియమితులయ్యారు.