జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-29T05:05:10+05:30 IST

బొడ్డపాడులో జైభీమ్‌ యువజన సంఘం 28వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆహ్వానిత జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం ప్రారంభించారు.

జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
ఐ.కొత్తూరు, బొడ్డపాడు జట్ల మధ్య రసవత్తరంగా కబడ్డీ పోటీ దృశ్యం

పలాస రూరల్‌:  బొడ్డపాడులో జైభీమ్‌ యువజన సంఘం 28వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆహ్వానిత జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం ప్రారంభించారు. రెండురోజులపాటు జరిగే ఈ పోటీలకు  20 జట్లు పాల్గొనగా  ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో  తొలి మ్యాచ్‌ బొడ్డపాడు ఐ.కొత్తూరు జట్ల మధ్య జరిగింది. కార్యక్రమంలో  జైభీమ్‌ యువజన సంఘం అధ్యక్షుడు కిక్కడ ఢిల్లీరావు, మాజీ సర్పంచ్‌లు తామాడ త్రిలోచనరావు, బొడ్డు సుధాకర్‌  పాల్గొన్నారు.

 

Updated Date - 2021-11-29T05:05:10+05:30 IST