గ్రంథాలయాల్లో సమస్యలు పరిష్కరిస్తా
ABN , First Publish Date - 2022-01-22T05:19:19+05:30 IST
జిల్లాలోని గ్రంథాలయాల్లో సమస్యలను దశ ల వారీగా పరిష్కరిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చీర్ల పద్మశ్రీ అన్నారు.
తణుకు, జనవరి 21: జిల్లాలోని గ్రంథాలయాల్లో సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చీర్ల పద్మశ్రీ అన్నారు. పైడిపర్రులోని క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ ఉద్యోగులతో శుక్రవారం ఆమె సమీక్షా సమావేశం నిర్వ హించారు. గ్రంథాలయ భవనాలు, ఫర్నీచర్, పుస్తకాలు, కంప్యూటర్ సమస్యలపై చర్చించారు. గ్రంథాలయాల్లో తగిన సదుపాయాలు కల్పించడం ద్వారా పాఠకులకు మరింత చేరువకావాలన్నారు. అనం తరం సమస్యలపై ఉద్యోగులు వినతి పత్రం అందించారు. వి.రవిశంకర్, డిప్యూటీ లైబ్రేరియన్ శ్రీనివాసరావు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.