అభివృద్ధిలో జిల్లా ముందుండాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-09-20T11:05:11+05:30 IST

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా ముందంజలో ఉండాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ తెలిపారు. ఎంపీడీవోలు, గ్రామీణ నీటి సరఫరా

అభివృద్ధిలో జిల్లా ముందుండాలి: కలెక్టర్‌

కలెక్టరేట్‌, సెప్టెంబరు 19:  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో  జిల్లా ముందంజలో ఉండాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ తెలిపారు.  ఎంపీడీవోలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో శనివారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని 7,306 మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం కాగా, ఇప్పటివరకూ 3,155 పూర్తి చేసినట్లు చెప్పారు.


మిగిలిన 3,933 మరుగుదొడ్లను ఈ నెలాఖరుకి  పూర్తి చేయాలని ఆదేశించారు.  గ్రామ సచివాలయాల్లోని  ఈ సేవల్లో జాప్యం  జరగడానికి వీలు లేదని కలెక్టర్‌ తెలిపారు. రైస్‌ కార్డులు పంపిణీల్లో  చాలా వెనుకబడి ఉన్నామని , వచ్చే రెండు మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేయాలని సూచించారు.  సచివాల యాల్లో వచ్చిన ఈ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.  విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 

Updated Date - 2020-09-20T11:05:11+05:30 IST