ఘనంగా అథ్లెటిక్స్ సంఘ సర్వసభ్య సమావేశం
ABN , First Publish Date - 2021-06-21T08:12:47+05:30 IST
జిల్లా అథ్లెటిక్స్ సంఘ సర్వసభ్య సమావేశం జిల్లా క్రీడా మైదా నంలో ఆదివారం ఘనంగా జరి గింది. జిల్లా అథ్లెటిక్స్ సంఘ అ ధ్యక్షుడు డాక్టర్ కె.స్పర్జన్రాజు అధ్యక్షతన జరిగిన సమావేశం లో ముందుగా అంతర్జాతీయ క్రీడాకారుడు మిల్కాసింగ్ మృతికి సంఘ సభ్యులు నివాళులర్పించి ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు.
కాకినాడ స్పోర్ట్స్, జూన్ 20: జిల్లా అథ్లెటిక్స్ సంఘ సర్వసభ్య సమావేశం జిల్లా క్రీడా మైదా నంలో ఆదివారం ఘనంగా జరి గింది. జిల్లా అథ్లెటిక్స్ సంఘ అ ధ్యక్షుడు డాక్టర్ కె.స్పర్జన్రాజు అధ్యక్షతన జరిగిన సమావేశం లో ముందుగా అంతర్జాతీయ క్రీడాకారుడు మిల్కాసింగ్ మృతికి సంఘ సభ్యులు నివాళులర్పించి ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. 2018-డీఎస్సీ ఎంపికలకు సంబంధించి జిల్లాకు చెందిన అథ్లెటిక్స్ క్రీడాకారులు గోవింద్, పవన్, కె.శివానిలు అర్హత సాధించి వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందడం జిల్లాకు గర్వకారణమన్నారు. వారికి సంఘం తరుఫున విజిల్ను బహుకరించారు. సమావేశంలో అథ్లెటిక్స్ సంఘ కార్యదర్శి టీవీఎస్ రంగారావు, సభ్యులు వైతాతబ్బాయి, గోవిందరాజులు, సాయి అథ్లెటిక్స్ విశ్రాంత కోచ్ కొండలరావు పాల్గొన్నారు.