జాతీయ స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థుల ఎంపిక
ABN , First Publish Date - 2020-12-03T05:46:24+05:30 IST
స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ 2020 జాతీయ స్థాయి పోటీలకు బంగారుగూడ విద్యార్థులు హర్షిద్, రుద్రలు ఎంపిక కావడం జిల్లాకే గర్వ కారణమని డీఈవో రవీందర్రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్టౌన్, డిసెంబరు 2: స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ 2020 జాతీయ స్థాయి పోటీలకు బంగారుగూడ విద్యార్థులు హర్షిద్, రుద్రలు ఎంపిక కావడం జిల్లాకే గర్వ కారణమని డీఈవో రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం ఇన్నోవేషన్ జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులకు డీఈవో పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. అనంతరం విద్యార్థులు ఆర్గనిక్ చాక్పిస్ ప్రాజెక్టును వివరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ యూనిసెఫ్లు సంయుక్తంగా రాష్ట్రంలోని విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఆన్లైన్లో స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ 2020 పోటీలను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6వేల 700 మంది విద్యార్థులు పాల్గొన్నారని, ఇందులో 25 ప్రాజెక్టులను జాతీయ స్థాయికి ఎంపికయ్యాయని తెలిపారు. ఇందులో జిల్లా నుంచి ప్రాజెక్టు ఉండడం గర్వకారణ మన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, బంగారుగూడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, గైడ్ టీచర్ రాము తదితరులున్నారు.