జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జిల్లా విద్యార్థి ప్రతిభ

ABN , First Publish Date - 2021-10-17T05:55:01+05:30 IST

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో జిల్లా విద్యార్థి సమితరెడ్డి సత్తా చాటాడు. 2021 జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జిల్లా విద్యార్థి ప్రతిభ
సమిత్‌రెడ్డి

ఆలిండియా 545వ ర్యాంకు సాధించిన సమితరెడ్డి

అనంతపురం విద్య, అక్టోబరు 16: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో జిల్లా విద్యార్థి సమితరెడ్డి సత్తా చాటాడు. 2021 జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. సమిత్‌రె డ్డి ఆలిండియా స్థాయిలో 545వ ర్యాంకు సాధించాడు. ధర్మవరం మండలం తనకంటివారిపల్లికి చెందిన పుట్టపర్తి సూర్యచంద్రారె డ్డి, అనితమ్మ దంపతుల కుమారుడు సమితరెడ్డి. సూర్యచంద్రారెడ్డి కూడేరు మండలం జయపురం ఎంపీపీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. సమిత్‌రెడ్డి అనంతపురంలోని భాష్యంలో 7వ తరగతి వరకూ, గుడివాడలోని విశ్వభారతి స్కూల్‌లో 10వ తరగతి వరకూ విద్యనభ్యసించాడు. ఇంటర్‌ విజయవాడలోని శ్రీచైతన్యలో పూ ర్తిచేశాడు. తొలి ప్రయత్నంలో నే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 545వ ర్యాంకు సాధించడం తో ఆ కుటుంబంలో ఆనం దం నెలకొంది. జిల్లాకు చెందిన మరికొందరు విద్యార్థులు కూడా ర్యాంకులు సాధించారు.


సివిల్స్‌ సాధిస్తా

మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఐఐటీలో బీటెక్‌ పూర్తి చేసి, తర్వాత సివిల్స్‌ సా ధిస్తా. ప్రజలకు సేవచేయాలన్నది నా ఆకాంక్ష. దా నిని నెరవేర్చుకునే వరకూ విశ్వాసంతో ముం దుకెళ్తా.

-  సమిత్‌రెడ్డి, 545వ ర్యాంకర్‌



Updated Date - 2021-10-17T05:55:01+05:30 IST