రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్లు ఖరారు

ABN , First Publish Date - 2021-02-24T04:44:35+05:30 IST

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్ల ఎంపి కలు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ మైదానంలో మంగళవారం జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షుడు మహ్మద్‌ అతీకుల్లా, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపికలను నిర్వహించారు.

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్లు ఖరారు

సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 23 : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్ల ఎంపి కలు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ మైదానంలో మంగళవారం జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షుడు మహ్మద్‌ అతీకుల్లా, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపికలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్‌ బాలకృష్ణరెడ్డి హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పురుషుల విభాగంలో 109, మహిళల విభాగంలో 92 మంది పాల్గొన్నారు. ఎంపికైన వారు మార్చి 5 నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఖోఖో సంఘం బాధ్యులు సింధుజ, సాయిబాబా, శ్రీకాంత్‌, స్రవంతి, వినోద్‌, నవీన్‌, సంధ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-02-24T04:44:35+05:30 IST