దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి

ABN , First Publish Date - 2021-12-04T03:43:52+05:30 IST

దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని జిల్లా దివ్యాంగుల సంక్షేమాధికారి ఎం.ఉమాదేవి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి శేషాద్రిలు పేర్కొన్నారు. శుక్రవారం బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. పలు రంగాల్లో రాణించిన దివ్యాంగులను సన్మానిం చారు.

దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
మాట్లాడుతున్న దివ్యాంగుల సంక్షేమాధికారి ఉమాదేవి

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 3 : దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని జిల్లా దివ్యాంగుల సంక్షేమాధికారి ఎం.ఉమాదేవి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి శేషాద్రిలు పేర్కొన్నారు. శుక్రవారం బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. పలు రంగాల్లో రాణించిన దివ్యాంగులను సన్మానిం చారు. ప్రభుత్వం దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోందన్నారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని పేర్కొన్నారు. దివ్యాం గులకు ప్రభుత్వం అందించే ట్రైసైకిళ్లు, స్కూటీలను అందజేస్తామని తెలిపారు. జిల్లా వికలాంగుల హక్కు ల సంఘం నాయకులు సత్యనారాయణ, తాజుద్దీన్‌, ఐసీడీఎస్‌ సిబ్బంది హేమసత్య,  పాల్గొన్నారు.

 ఏసీసీ: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పట్టణంలోని మండల విద్యావనరుల కేంద్రంలో  నిర్వ హించారు. ఎంఈవో పోచయ్య మాట్లాడుతూ దివ్యాం గులను ఆదరించాలని, వారిలో అద్భుతమైన ప్రతిభ,  శక్తి సామర్ధ్యాలు ఉంటాయన్నారు. ఉపాధ్యాయులు శ్రీలత, సృజన, సిబ్బంది రాకేష్‌, సరిత పాల్గొన్నారు.


Updated Date - 2021-12-04T03:43:52+05:30 IST