ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నా: డీకే అరుణ

ABN , First Publish Date - 2021-08-01T20:25:28+05:30 IST

కరోనా తగ్గించి ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు బీజేపీ నేత డీకే అరుణ అన్నారు.

ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నా: డీకే అరుణ

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో ప్రజలు బాధపడుతున్నారని.. కరోనా తగ్గించి ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. ఆదివారం ఆమె లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ దేశం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న కృషికి అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని ప్రార్థించానన్నారు. మనం కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పాలన కింద నలిగిపోతున్నామన్నారు. ప్రజాస్వామ్య విలువలున్న పాలన తెలంగాణలో రావాలని, తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు డీకే అరుణ తెలిపారు.

Updated Date - 2021-08-01T20:25:28+05:30 IST