ఈటలకు కరోనా రోగుల పట్ల సోయి లేదు: డీకే అరుణ
ABN , First Publish Date - 2021-05-01T00:02:13+05:30 IST
మంత్రి ఈటల రాజేందర్కు బీజేపీ నాయకురాలు డీకే అరుణ లేఖ రాశారు. కరోనా కట్టడి రాష్ట్రం ప్రభుత్వ తీరును
హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్కు బీజేపీ నాయకురాలు డీకే అరుణ లేఖ రాశారు. కరోనా కట్టడి రాష్ట్రం ప్రభుత్వ తీరును ఆమె తప్పుబట్టారు. మంత్రి పదవి పోతుందన్న భయం ఈటలలో కనిపిస్తోందని, ఈటల మాటలు చూస్తూంటే ఆయన మానసిక స్థితిపై అనుమానాలునాలు కలుగుతున్నాయని ఎద్దేవాచేశారు. అడిగిన దానికంటే కేంద్రం ఆక్సిజన్ ఎక్కువ ఇస్తోందని.. పొగిడిన ఈటల ఇప్పుడు మాట మార్చారెందుకు? అని ప్రశ్నించారు. మతిభ్రమించే మంత్రి ఈటల మాట మార్చారా అని నిలదీశారు. సీఎంను ప్రసన్నం చేసుకోవాలన్న తాపత్రయం తప్ప.. ఈటలకు కరోనా రోగుల పట్ల సోయి లేదని డీకే అరుణ తప్పుబట్టారు.