మా సంగతి సరే.. మీ అడ్రస్‌ ఎక్కడో వెతుక్కోండి

ABN , First Publish Date - 2021-10-24T17:10:27+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమంటూ మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప చేసిన వ్యాఖ్యలపై కేసీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిందగిలో శనివా

మా సంగతి సరే.. మీ అడ్రస్‌ ఎక్కడో వెతుక్కోండి

               - యడియూరప్పకు డీకే శివకుమార్‌ చురకలు


బెంగళూరు(Karnataka): రాష్ట్రంలో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమంటూ మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప చేసిన వ్యాఖ్యలపై కేసీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిందగిలో శనివారం ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగిస్తూ మా అడ్రస్‌ సంగతి సరే ముందు మీ అడ్రస్‌ ఎక్కడ ఉందో వెతుక్కోండి అంటూ చురకలంటించారు. రాష్ట్ర బీజేపీలో యడియూరప్ప నామమాత్రంగా మిగిలిపోయారన్నారు. కేవలం ఓట్ల కోసం బీజేపీ యడియూరప్పను రంగంలోకి దించిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి 140 స్థానాలు గెలుస్తామని ఆయన ధీమాగా చెబుతున్నారని, తమకైతే మొత్తం 224 నియోజకవర్గాల గెలుపు లక్ష్యంగా ఉందన్నారు. రాజాహులి యడియూరప్పతో బొమ్మై హులి చేరిందని, కాంగ్రెస్‌ ఎలుకలు కావడం ఖాయమని బీజేపీ నేతల వ్యాఖ్యలను తిప్పికొట్టారు. మూషికాలు గణపతి చుట్టే తిరుగుతాయన్న వాస్తవాన్ని గుర్తెరగాలన్నారు. మరోవైపు సిందగిలో సిద్దరామయ్య ఎన్నికల ప్రచారం శనివారం కూడా కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయారని ఈ ఉప ఎన్నికల్లో ఓటు ఆయుధం ద్వారా తమ ఆక్రోశం వ్యక్తం చేయడం ఖాయమన్నా రు. ఉప ఎన్నికల్లో ధనప్రవాహం తీవ్రంగా ఉందని, ఇలాంటివారిని గుర్తించి పట్టుకుని ఎన్నికల సంఘానికి అప్పగించాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచకశక్తులు రాజ్యమేలుతున్నాయని అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం కనిపిస్తోందని విరుచుకుపడ్డారు. 

Updated Date - 2021-10-24T17:10:27+05:30 IST