డీకే శివకుమార్, సిద్దరామయ్యకు ఝలక్ ఇచ్చిన Rahul gandhi

ABN , First Publish Date - 2021-07-22T01:31:41+05:30 IST

కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఈ

డీకే శివకుమార్, సిద్దరామయ్యకు ఝలక్ ఇచ్చిన Rahul gandhi

న్యూఢిల్లీ : కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం కాస్త కటువుగానే స్పందించింది. ఇద్దరిలో ఏ ఒక్కర్నీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించమని తేల్చి చెప్పింది. వీరిద్దరూ కలిసి పనిచేయాల్సిందేనని కర్నాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ రణదీప్ సూర్జేవాలా తేల్చి చెప్పారు. డీకే, సిద్దరామయ్య మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో సిద్దరామయ్య, డీకేను ఢిల్లీకి పిలిపించింది అధిష్ఠానం. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ వీరిద్దరితో సమావేశమయ్యారు. ఇద్దరిలో ఏ ఒక్కరికీ అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరగదని, ఇద్దర్నీ సమానంగానే చూస్తామని రాహుల్ కూడా తేల్చి చెప్పారు. పంజాబ్ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే అధిష్ఠానం ఇంత కటువుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై డీకే శివకుమార్ స్పందించారు. కర్నాటకలో ఎలాంటి వైరుద్ధ్యాలూ లేవని స్పష్టం చేశారు. ఉమ్మడిగా, కలిసే ముందుకు సాగుతామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-22T01:31:41+05:30 IST