ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్య సేవలు పొందాలి

ABN , First Publish Date - 2021-05-16T06:11:07+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్య సేవలు పొందాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్య సేవలు పొందాలి

ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో సుధార్‌ సింగ్‌

భూపాలపల్లి కలెక్టరేట్‌, మే 15 : వైద్య సేవలను జిల్లా ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే పొందాలని వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌చార్జి జిల్లా అధికారి (డీఎంహెచ్‌వో) జె.సుధార్‌ సింగ్‌ సూచించారు. శనివారం ఆయన ఒక ప్రకటన వెలువరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలను ఉచితంగా పొందాలని పేర్కొన్నారు. పరీక్షలు కూడా ఉచితంగా చేయించుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకున్న వారు తమ ఫోన్‌ నంబర్‌కు మేసేజ్‌ వచ్చిన తర్వాతే టీకా వేయించుకోవాలని సూచించారు.  

Updated Date - 2021-05-16T06:11:07+05:30 IST