డీఎంకే నాయకుడికి కత్తిపోట్లు
ABN , First Publish Date - 2020-10-14T17:13:42+05:30 IST
ప్యారీస్ నగర డీఎంకే కార్యవర్గ కమిటీ సభ్యుడు ధనశేఖరన్ కత్తిపోట్లకు గురయ్యారు. కేకేనగర్లోని కార్యాలయంలో ధనశేఖరన్ ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో లోనికి...
చెన్నై : ప్యారీస్ నగర డీఎంకే కార్యవర్గ కమిటీ సభ్యుడు ధనశేఖరన్ కత్తిపోట్లకు గురయ్యారు. కేకేనగర్లోని కార్యాలయంలో ధనశేఖరన్ ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో లోనికి ప్రవేశించి దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో ధనశేఖరన్తో పాటు కార్యాలయంలో పనిచేస్తున్న మహిళకు కూడా గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న కార్యకర్తలు ధనశేఖరన్ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, మహిళను ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేకేనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆగంతకుల కోసం గాలిస్తున్నారు.