HYD: మంత్రి కేటీఆర్తో డీఎంకే ఎంపీలు భేటీ
ABN , First Publish Date - 2021-10-13T17:05:09+05:30 IST
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తో డీఎంకే నేతలు బుధవారం ఉదయం భేటీ అయ్యారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తో డీఎంకే నేతలు బుధవారం ఉదయం భేటీ అయ్యారు. నీట్ రద్దు చేయాలనే డిమాండ్కు మద్దతు ఇవ్వాలని పలువురు ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. ఇదే అంశంపై కేటీఆర్తో డీఎంకే ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను కేటీఆర్కు డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు అందజేశారు. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తూ 12 మంది సీఎంలకు స్టాలిన్ లేఖ రాశారు.