డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్కు నెగిటివ్
ABN , First Publish Date - 2020-10-01T15:36:15+05:30 IST
డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్కు నెగిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల
చెన్నై : డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్కు నెగిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి, కర్నాటక శాసన సభ్యుడు దినేష్ గుండూరావు చెన్నైలో రెండు రోజులపాటు పర్యటించి కాంగ్రెస్ సభల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తదితరులను కలుసుకున్నారు. దినేష్ గుండూరావు బెంగళూరు చేరుకున్నాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అక్కడ ఆయన పరీక్షలు చేసుకోగా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి.
ఈ నేపథ్యంలో దినేష్ గుండూరావు స్టాలిన్ను కలుసుకున్నప్పుడు శాలువతో సత్కరించి, కరచాలనం కూడా చేశారు. ఈ కారణాలతో తనకు కరోనా సోకిందే మోనని స్టాలిన్ అనుమానించారు. మంగళవారం పార్టీ కార్యాలయం అన్నా అరివాలయంలో పని చేస్తున్న సిబ్బందికి తనకు కరోనా పరీక్షలు చేయించారు. బుధవారం వచ్చిన ఫలితాల్లో అన్నా అరివాలయం సిబ్బందికి, స్టాలిన్కు వైరస్ సోకలేదని, అందరికీ నెగిటివ్ వచ్చిందని వైద్యనిపుణులు తెలిపారు. దీంతో స్టాలిన్ సహా అరివాలయ సిబ్బంది ఊరట చెందారు.