డీఎన్ఏ-ఎంబీ ల్యాబ్కు భూమిపూజ
ABN , First Publish Date - 2021-10-24T08:12:34+05:30 IST
దేశంలోనే మొదటిసారిగా డీఎన్ఏ అండ్ మాలిక్యూలర్ బయోలజీ ల్యాబ్కు హైదరాబాద్ వేదిక కానుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎ్ఫఎ్సఎల్)లతో పోలిస్తే.. డీఎన్ఏ అండ్ మాలిక్యూలర్..
- దేశంలోనే తొలిసారి హైదరాబాద్లో ఏర్పాటు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే మొదటిసారిగా డీఎన్ఏ అండ్ మాలిక్యూలర్ బయోలజీ ల్యాబ్కు హైదరాబాద్ వేదిక కానుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎ్ఫఎ్సఎల్)లతో పోలిస్తే.. డీఎన్ఏ అండ్ మాలిక్యూలర్ బయోలజీ ల్యాబ్ ఎన్నోరెట్లు అధిక కచ్చితత్వం, వేగంతో ఫలితాలను అందజేస్తుంది. ఎనిమిది నెలల్లో అందుబాటులోకి రానున్న ఈ ల్యాబ్ నిర్మాణానికి హోంమంత్రి మహమూద్ అలీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ పోలీసులు సాంకేతికతను అధికంగా వినియోగిస్తున్నారన్నారు. ఈ మేరకు డీఎన్ఏ అండ్ మాలిక్యూలర్ బయోలజీ ల్యాబ్ నిర్మాణానికి పునాదిరాళ్లు పడ్డాయన్నారు.