అనారోగ్యంతో బాధపడుతున్న పేద మహిళకు చేయూత

ABN , First Publish Date - 2022-01-24T05:02:46+05:30 IST

మండలంలోని మాధవరం-1 రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ మేరువ లక్ష్మీదేవికి ఆదివారం మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ చేయూతనందించింది.

అనారోగ్యంతో బాధపడుతున్న పేద మహిళకు చేయూత

సిద్దవటం, జనవరి 23 : మండలంలోని మాధవరం-1 రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ మేరువ లక్ష్మీదేవికి ఆదివారం మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ చేయూతనందించింది. వివరాల్లోకెళితే.. మేరువ లక్ష్మీదేవి కూలి పనులు చేస్తూ ముగ్గురు పిల్లల్ని పోషించుకుంటూ జీవనం సాగించేంది. అయితే ఆమె ఇటీవల  అనారోగ్యంతో మంచాన పడింది. వైద్యులు ఆపరేషన్‌ చేయాలని నిర్ధారించడంతో ఆర్థిక స్థోమత లేకపోవడంతో మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థను ఆశ్రయించారు. ఇందుకు స్పందించిన ఆ సంస్థ చైర్మన్‌ అవ్వారు రవిశంకర్‌ దాతల సహకారంతో 14000 రూపాయలు నగదును ఆమెకు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-24T05:02:46+05:30 IST