నాకు న్యాయం చేయండి

ABN , First Publish Date - 2022-01-19T04:53:57+05:30 IST

భార్య, ఇద్దరు పిల్లల విషయాన్ని దాచిపెట్టి మరో యువతిని పెళ్లి చేసుకోవటంతో సదరు మహిళ దీక్షకు దిగింది. ఈ ఘటన మంగళవారం భద్రాద్రి జిల్లా సారపాకలో జరిగింది.

నాకు న్యాయం చేయండి

 చర్చి ఎదుట  కుమారుడితో వివాహిత దీక్ష 

బూర్గంపాడు, జనవరి 18: భార్య, ఇద్దరు పిల్లల విషయాన్ని దాచిపెట్టి మరో యువతిని పెళ్లి చేసుకోవటంతో సదరు మహిళ దీక్షకు దిగింది. ఈ ఘటన మంగళవారం భద్రాద్రి జిల్లా సారపాకలో జరిగింది.  భాదితురాలి కఽథనం ప్రకారం.... ఏపీలోని మారెడుమిల్లి ప్రాంతానికి చెందిన సువర్ణరాజు బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో పాస్టర్‌గా పని చేస్తున్నాడు. పాత సారపాకకు చెందిన సులోచన అదే చర్చికి వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో భాదితురాలి తల్లితండ్రుల సమక్షంలో 2008లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఖమ్మంలో ఉంచాడు. వీరికి 2014లో ఓ బాబు జన్మించాడు. వీరి మధ్య మనస్పర్ధలు రాడంతో విడిగా జీవించాలని నిర్ణయించుకున్నారు. దీంతో కొన్ని నెలల క్రితం పెద్దల సమక్షంలో మనోవర్తి నిమిత్తం నగదును చెల్లిస్తానని కాగితాలు రాసిచ్చాడు. అప్పటి నుంచి తన భర్త సువర్ణరాజు కనిపించకుండా పోయాడని బాధితురాలు ఆరోపించారు. న్యాయం చేయాలని కుమారుడుతో కలిసి సువర్ణరాజు పని చేసిన చర్చి గేటు ఎదుట దీక్ష చేపట్టింది.  కాగా ఈ ఘటనకు సంబంధించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

బెదిరించి లైంగిక దాడి చేశాడు  

 న్యాయం చేయాలంటూ ఓ యువతి ఆవేదన

  తొలుత అత్యాచారయత్నం చేశాడంటూ ఫిర్యాదు.. 

  కేసు నమోదు.. రిమాండ్‌కు తరలింపు

  అఘాయిత్యం చేశాడంటూ వీడియో ద్వారా వెల్లడి

  తిరుమలాయపాలెం మండలంలో ఘటన

తిరుమలాయపాలెం, జనవరి18: తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి వచ్చి.. తనను బెదిరించి లైంగిక చేశాడని, ఈ విషయం బయటకు చెబితే పెట్రోల్‌ పోసి చంపేస్తానని బెదిరించాడని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామానికి చెందిన 23 ఏళ్ల ఓ యువతి సెల్ఫీవీడియోలో గోడు వెళ్లబోసుకుంది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. తాను డిసెంబరు 31న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన 27ఏళ్ల వయసున్న లంజపల్లి ఫిరోజ్‌గాంధీ అనే యువకుడు ఇంట్లోకి వచ్చి, తనపై అత్యాచారయత్నం చేశాడని అదే రోజున ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు పంపారు. కాగా మంగళవారం ఆరోగ్యం బాగాలేదంటూ సదరు యువతి వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి వచ్చి.. తనను ఆ యువకుడు బెదిరించి అత్యాచారం చేశాడని, బయటకు చెబితే చంపుతాని బెదరించాడని, అతని కుటుంబంనుంచి రక్షణ కలిపించాలని ఓ వీడియో ద్వారా కోరింది. అలాగే అతడి కుటుంబసభ్యులు పెట్రోల్‌ పోసి చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈవిషయంపై పోలీసులకు ఫిర్యాదుచేస్తే పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తంచేయడం చర్చనీ యాశంమైంది. అయితే ఈ విషయంపై తిరుమలా యంపాలెం ఎస్‌ఐ భవానీని వివరణ కోరగా ఫిరోజ్‌ గాంధీ తనపై అత్యాచారయత్నం చేశాడని ఆ యువతి డిసెంబరు 31న ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు పంపామన్నారు.కానీ అత్యాచారం జరిగినట్టుగా తమకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని ఎస్‌ఐ వివరించారు. కాగా ఈసంఘటన విషయంలో గ్రామంలో ఇరువర్గాల మధ్య పంచాయితీ జరిగిందని, ఆ పంచాయతీలో ఏకా భిప్రాయం కుదరక పోవడంతోనే అత్యాచారం జరిగిందంటూ వీడియోను తెరపైకి తెచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. 

 పద్మ మృతదేహం

మాట వినడం లేదని 

గొంతు కోశాడు

మహిళను దారుణంగా హతమార్చిన ప్రియుడు

టేకులపల్లి, జనవరి18: ఆడపడచు భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఒక మహిళ అదే వ్యక్తి చేతిలో  దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని తావుర్యాతండాలో మంగళవారం జరిగింది. తావుర్యా తండాకు చెందిన భూక్యా పద్మ(40)కు ఆదే గ్రామానికి చెందిన క్రిష్ణతో కొన్నేళ్లక్రితం వివాహం జరిగింది. వారికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే ఏడేళ్ల క్రితం ఆమె భర్త క్రిష్ణ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తరువాత పద్మను ఆమె ఆడపడుచు భర్త గుగులోతు వెంకన్న లోబరుచుకొని శారీరక సంబంధం ఏర్పరచుకొని తావుర్యాతండాలోని పద్మ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో 20రోజుల క్రితం పద్మ కూతురుని తన మొదటి భార్య కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని వెంకన్న కోరాడు. దానికి పద్మతో పాటు ఆమె కుమార్తె కూడా నిరాకరించి వెంకన్నను ఇంట్లో నుంచి గెంటివేశారు. దాంతో పద్మ తనమాట వినడంలేదని ఆమెను హతమార్చేందుకు పథకం పన్నాడు. ఈ క్రమంలో మంగళవారం పద్మ తన మిర్చితోటలో పని చేస్తుండగా అక్కడికి వెళ్లిన వెంకన్న కత్తితో పద్మ మెడకోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పద్మ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టేకులపల్లి సీఐ బీ. రాజు తెలిపారు.

Updated Date - 2022-01-19T04:53:57+05:30 IST