భయం వద్దు.. జాగ్రత్తలు పాటించండి
ABN , First Publish Date - 2022-01-18T04:54:30+05:30 IST
కరోనా మూడో దశ గురిం చి భయం వద్దని, జాగ్రత్తలు పాటించడం మాత్రం తప్పనిసరి అని స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆర్టీపీసీఆర్ సెంటర్ ప్రారంభంలో ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు క్రైం, జనవరి 17 : కరోనా మూడో దశ గురిం చి భయం వద్దని, జాగ్రత్తలు పాటించడం మాత్రం తప్పనిసరి అని స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక జిల్లాఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన కొవిడ్ నిర్ధారణ ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని ఎమ్మెల్యే రాచమల్లు ప్రారంభించారు. అనంతరం ఆయన వైద్యాధికారులతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రామేశ్వరుడు, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్ సెల్వరాజ్, ఆర్ఎంవో ఆనంద్బాబు, చర్మవ్యాధుల నిపుణుడు డాక్టర్ సురేష్, కంటివైద్యనిపుణుడు డాక్టర్ బుసిరెడ్డి, వైద్య సిబ్బంది ఎంపీపీ శేఖర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.