రైతులు అధైర్యపడొద్దు : మంత్రి అల్లోల
ABN , First Publish Date - 2020-04-09T11:26:35+05:30 IST
అన్నదాతలు అధైర్య పడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం
సోన్, ఏప్రిల్ 8 : అన్నదాతలు అధైర్య పడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు మా దాపూర్, జాఫ్రాపూర్, న్యూ వెల్మల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. కరోనా ప్రబలుతున్న త రుణంలో కూడా రైతులు నష్టపోకుండా మద్దతు ధర కల్పిస్తూ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ బర్ల మానస, జ డ్పీటీసీ జీవన్ రెడ్డి, నాయకులు అల్లోల మురళీధర్ రెడ్డి, రాంకిషన్ రెడ్డి, కృష్ణ ప్రసాద్ రెడ్డి, సర్పంచ్లు వినోద్ కుమార్, రాజ నర్సింహ రెడ్డి, సునీత, అంకం గంగామణి, ఎంపీటీసీలు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.